మారేడుమిల్లి విషాదం.. ఇద్దరు వైద్య విద్యార్థినుల మృతదేహాలు లభ్యం

71చూసినవారు
మారేడుమిల్లి విషాదం.. ఇద్దరు వైద్య విద్యార్థినుల మృతదేహాలు లభ్యం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లిన వారిలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతవ్వగా.. సోమవారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పార్వతీపురం జిల్లా బొబ్బిలికి చెందిన కొసిరెడ్డి సౌమ్య (21), బాపట్లకు చెందిన బి.అమృత (21) మృతదేహాలను గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీహెచ్ హరదీప్ (20) కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్