విజయసాయిరెడ్డి కుమార్తె స్థలంలో రెండోసారి కూల్చివేతలు

82చూసినవారు
విజయసాయిరెడ్డి కుమార్తె స్థలంలో రెండోసారి కూల్చివేతలు
విశాఖ జిల్లా భీమునిపట్నం సాగరతీరంలోని ఆక్రమిత స్థలంలో చేపట్టిన కాంక్రీట్‌ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. (సీఆర్‌జడ్) తీర ప్రాంత పరిరక్షణ నియమాలను ఉల్లఘించి ఆక్రమిత స్థలంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టిన కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు రెండోరోజు నేలమట్టం చేశారు. సముద్ర తీరంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ కట్టడాలను పూర్తిగా కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్