జత్వానీకి భద్రత కల్పిస్తున్నాం: విజయవాడ సీపీ

58చూసినవారు
జత్వానీకి భద్రత కల్పిస్తున్నాం: విజయవాడ సీపీ
బాలీవుడ్‌ నటి కాదంబరీ జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఇవాళ అర్ధరాత్రికి విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొస్తామని, సోమవారం కోర్టులో హాజరుపరుస్తాని చెప్పారు. ముంబై నటి కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నామన్నారు. జత్వానీకి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్