మిగ్‌జాం ఎఫెక్ట్‌.. ప. గో జిల్లాలో తీవ్రంగా పంట నష్టం

80చూసినవారు
మిగ్‌జాం ఎఫెక్ట్‌.. ప. గో జిల్లాలో తీవ్రంగా పంట నష్టం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మిగ్‌జాం తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉండి, భీమవరం, కాళ్ల తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. కల్లాల్లో ధాన్యం ఉండడంతో వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ముదినేపల్లి, కలిదిండి, పెదపాడు, నూజివీడు, భీమవరం, పాలకొల్లు పెనుమంట్ర వరి పనలు నీట మునిగాయి. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి. నరసాపురం తదితర మెట్ట మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుము పంటలు నీట మునిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్