AP: రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రుతు పవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వివరించింది.