ఏపీ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం హాట్ టాపిక్గా మారింది. NDA అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి బరిలో నిలవగా.. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీలో నిలిచారు. తాజాగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. యు.కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించారు. కిర్లంపూడి వేదికగా జరిగిన ఈ భేటీలో ఎన్నికల ప్రచారం నిర్వహణపై చర్చించారు.