భారీ జీతంతో ఉద్యోగాలు.. వివ‌రాలివే

78657చూసినవారు
భారీ జీతంతో ఉద్యోగాలు.. వివ‌రాలివే
TTD ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో 29 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తుల ప్ర‌క్రియ సోమ‌వారం(మార్చి 25)తో ముగియ‌నుంది. ఏపీకి చెందిన హిందువులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. applications-psc.ap.gov.in/LoginNew.aspx వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఎంపికైతే నెలకు రూ.57,100- రూ.1,47,760 వేతనం అందుకోవ‌చ్చు.

సంబంధిత పోస్ట్