ఆదోనిలో రూ. 1, 981 తగ్గిన ఎండు మిర్చి ధర
By W. Abdul 68చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఎండు మిర్చి గరిష్ట ధర రూ. 7, 109 పలికింది. గత బుధవారంతో పోలిస్తే రూ. 1, 981 తగ్గింది. కనిష్ట ధర రూ. 2, 539 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్కు ఎండు మిర్చి 120 బస్తాలు, 42 క్వింటాళ్లు వచ్చాయన్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి సంబంధిత ఏజెంట్, వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు.