బెంగళూరులో రూ.4 లక్షల విలువైన బంగారు చైన్ తో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన దంపతులు

60చూసినవారు
బెంగళూరులో రూ.4 లక్షల విలువైన బంగారు చైన్ తో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన దంపతులు
4 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు గొలుసుతో కూడిన గణేష్ విగ్రహాన్ని మొబైల్ ట్యాంక్‌లో పొరపాటున నిమజ్జనం చేసింది ఓ జంట. ఈ ఆసక్తికర ఘటన బెంగళూరులో జరిగింది. అయితే నిమజ్జనానికి ముందే గొలుసును తీసేయాలని భావించిన, హడావీడిలో మర్చిపోయామని దంపతులు రామయ్య, ఉమాదేవి తెలిపారు. 10 గంటలపాటు శ్రమించి, ఆ ట్యాంక్ నుంచి 10 వేల లీటర్ల నీటిని పంపింగ్ చేసిన అనంతరం ఆ చైన్ బయటపడినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్