పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై సమీక్ష

75చూసినవారు
పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై సమీక్ష
ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సమావేశ మందిరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ మరియు ఒక పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్ల కంటే అధికంగా ఉన్న వారిని మరో పోలింగ్ కేంద్రాలకు మార్పుపై రాజకీయ పార్టీ ప్రతినిధుల నాయకులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో తహసిల్దార్ శివరాముడు, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ రామేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.