రైతులకు వ్యవసాయ శాఖ ఏడిఏ రామ్మోహన్ రెడ్డి సూచనలు

51చూసినవారు
రైతులకు వ్యవసాయ శాఖ ఏడిఏ రామ్మోహన్ రెడ్డి సూచనలు
రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని వ్యవసాయ శాఖ ఏడిఏ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బాచేపల్లి, అహోబిలం గ్రామాలలో వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రభుత్వ పథకాలు మరియు పంటలపై పాటించు మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించారు. అనంతరం రైతుల పొలాలను సందర్శించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్