సుంకులా పరమేశ్వరిని దర్శించుకున్న కర్నూలు ఎంపీ నాగరాజు

75చూసినవారు
సుంకులా పరమేశ్వరిని దర్శించుకున్న కర్నూలు ఎంపీ నాగరాజు
గూడూరు మండలం కె. నాగలాపురంలో వెలిసిన సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని శనివారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎంపీకి స్థానిక టిడిపి నాయకులు, గ్రామప్రజలు స్వాగతం పలికారు. సుంకులమ్మను దర్శించుకున్న ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎంపీ నాగరాజు వేదాశీర్వచనాలను అందించారు.

సంబంధిత పోస్ట్