మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

56చూసినవారు
మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం పై సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం నాయకులు రణధీర్, రామ్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆత్మకూరు పట్టణంలోని పలు కాలనీలను వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో పారిశుధ్యం లోపించి రోగాలు ప్రబలుతున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.