ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి

54చూసినవారు
ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు ఆర్టీసీ డిపోకు కొత్తగా కేటాయించిన 3 సూపర్ లగ్జరీ సర్వీసులను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్సును స్వయంగా కొంత దూరం డ్రైవ్ చేశారు. అనంతరం డిపో నుంచి ఫోస్టాఫీసు సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తిరిగి డిపో వరకు బస్సులను ట్రయిల్ రన్ నిర్వహించగా ఎమ్మెల్యేతో పాటు అధికారులు, టిడిపి నాయకులు అందులో ప్రయాణించారు.

సంబంధిత పోస్ట్