బూదూరులో భక్తిశ్రద్ధలతో పాండురంగస్వామి అగ్ని గుండం

55చూసినవారు
దొరవారిసత్రం మండలం లోని బూదూరులో శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణి దేవి సమేత పాండురంగస్వామి అగ్ని గుండ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, స్థానిక సర్పంచి చెంగయ్య, తెదేపా నాయకులు పామంజి శ్రీనివాసులు, గునకల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్