
కలిగిరికి చెందిన సాయి చంద్ కు డాక్టరేట్
నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన నందనవనం సాయిచంద్ అనే వ్యక్తికి డాక్టరేట్ లభించింది. మూర్చ వ్యాధిని పసిగట్టే యంత్రంపై పరిశోధనలు చేసిన సాయిచంద్ కు మైసూర్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందజేసింది. ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. గోపి నాయక్ మార్గదర్శకంలో "ఏరోటిక్ డి కంపోజిషన్ బెస్ట్ ఫ్రెమ్ వర్క్ ఆన్ సీజేర్ డిటెక్షన్" లో సమర్థవంతంగా పరిశోధనలు చేసినందుకు ఈ డాక్టరేట్ సాయి చెంద్ కు ప్రధానం చేసినట్లు మంగళవారం తెలిపారు.