ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతుంటే..
వైసీపీ వారంతా నాపై ముప్పేట దాడి చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. "వైఎస్ వారసులమని చెప్పేవారు.. 'గుండ్లకమ్మ'ను ఎందుకు పట్టించుకోవడం లేదు. గేట్లు ఊడిపోయినా పట్టించుకోని వారా ఆయన ఆశయాలు నిలబెట్టేది? వైఎస్ఆర్సీపీలో అసలు వైఎస్ఆర్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి." అని షర్మిల సెటైర్లు వేశారు.