అబద్ధాల్లో సీఎం జగన్ పీహెచ్డీ చేశారని
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో శనివారం నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన ప్రసంగించారు. "సాగునీటి ప్రాజెక్టులకు
వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే జగన్ పాలసీ." అని చంద్రబాబు విమర్శించారు.