లోకేష్ ను కలిసిన మైలవరం ఎమ్మెల్యే

51చూసినవారు
లోకేష్ ను కలిసిన మైలవరం ఎమ్మెల్యే
విజయవాడలో జరిగిన టిడిపి శాసనసభ పక్ష సర్వసభ్య సమావేశానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ మేరకు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ లోని ఏ కన్వెన్షన్ సెంటర్లో టి డి ఎల్ పి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్