టిడిపి అధినేత, ఎన్డీయే కూటమి శాసనసభ పక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. మంగళవారం17 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ పనులు, సభా వేదికను మంగళవారం కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజుతో కలిసి పర్యవేక్షించారు.