‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగలేదు. ఇప్పటివరకు ఆ పరిశ్రమ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు. రకరకాల ప్రతిపాదనలు వస్తుంటాయి. అవి వచ్చినంత మాత్రానా అమలు చేస్తున్నట్లు కాదు’ అని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వైసీపీ కావాలనే జాప్యం చేసిందని, ఎన్డీయే కూటమి గెలవగానే పోలవరం పూర్తి చేస్తామన్నారు.