ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.