చెన్నైలో రన్నింగ్లోని సిటీ బస్సు నుంచి పడి 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. బస్సు వీకే నగర్ సమీపంలోకి వస్తుండగా బాలుడు కిందికి దిగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అదుపుతప్పి కింద పడ్డాడు. ఆ వెంటనే అతడిపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లాయి. దీంతో స్పాట్లోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బస్సు మెట్లపై ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది.