మాచర్లలో ఎన్టీఆర్ దిమ్మె ధ్వంసం

69చూసినవారు
మాచర్ల పట్టణంలోని 24వ వార్డులో పోలేరమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ దిమ్మెను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సోమవారం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్