నరసరావుపేటలోని శ్రీ హరిణి అకాడమీ నందు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో, గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల ఉచిత అవగాహన సదస్సు ఈనెల 31వ తేదీన నిర్వహించబడుతుందని డివైఎఫి జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు శనివారం తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన వారందరికీ, తెలుగు అకాడమీ వారి రెండు పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడునని అలాగే మూడు మోడల్ పేపర్లు కూడా ఉచితం అని తెలిపారు.