వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే గంజాయి రవాణా: కొమ్మలపాటి

62చూసినవారు
వైసీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లో గంజాయి అక్రమ రవాణా సాగుతోందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. సోమవారం పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గంజాయిని తరిమికొట్టే విధంగా ప్రతి ఒక్క అధికారి వ్యవహరించాలన్నారు. అందుకోసం కూటమి శ్రేణులు సహకరించాలని సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్