రేపటితో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది: జీవి

64చూసినవారు
రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేపటితో పోతుందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయన్నారు. అధికారులను బయపెట్టిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నానిని జైలులో వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్