పెంట గ్రామంలో శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

58చూసినవారు
పెంట గ్రామంలో శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
బొబ్బిలి మండలం పెంట గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత నగరేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని, అమ్మవారి మీద మరియు పరమేశ్వర శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడంతో గొప్ప విశేషాన్ని సంతరించాయి. ఆలయ అర్చకులు, సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ ధూపం. వాసు, ఈ ఘడియల్లో స్వామివారికి అర్చనలు నిర్వహించి, క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. మత మార్పిడులు జరగకుండా హిందూ ధర్మ రక్షణ జరగాలని కోరారు.

సంబంధిత పోస్ట్