దత్తిరాజేరు మండలంలో సంకల్పం కార్యక్రమం

82చూసినవారు
దత్తిరాజేరు మండలంలో సంకల్పం కార్యక్రమం
దత్తిరాజేరు మండలం పెదమానాపురం సమీపంలో గల సంత తోట వద్ద ఎస్ఐ జయతి ఆదివారం సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాదకద్రవ్యాలు వినియోగం కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని స్థానిక ఆటో డ్రైవర్లకు సూచించారు. సమాజంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనపడితే తమకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్