జేఈఈ ఫలితాల్లో మెరిసిన వీరఘట్టం విద్యార్థి

51చూసినవారు
జేఈఈ ఫలితాల్లో మెరిసిన వీరఘట్టం విద్యార్థి
వీరఘట్టం మండలం నడుకూరు గ్రామానికి చెందిన గొర్లె పవన్ కుమార్ ఆదివారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 1004వ ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 153వ ర్యాంకు సాధించారు. అత్యుత్తమ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ ఇదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని స్థానిక గ్రామస్థులు సోమవారం అభినందించారు.