మొక్క జొన్నకు మద్దతు ఇవ్వాలి: సిపిఎం
మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి, ఆ రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు రమణ రావు కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం లో పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలంలో తదితర గ్రామాల్లో మొక్కజొన్న విస్తారంగా సాగైందన్నారు. అయితే పంటకు మాత్రం మద్దతు ధర లభించలేదన్నారు. పంటను రైతులు కళ్లాలకు తీసుకొచ్చి 15 రోజులైన కొనేవారు లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.