పార్వతీపురం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పట్టణంలో స్టాప్ డయేరియా కార్యక్రమం జులై 1 నుండి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సచివాలయాల సెక్రటరీలకు, ప్రజారోగ్య సిబ్బందికి, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ కె. శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.