గ్రామ లలో దోమల మందు స్ప్రేయింగ్
మలేరియా నియంత్రణే ధ్యేయంగా నిర్వహిస్తున్న దోమల మందు పిచికారీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎంఒ టి. జగన్మోహనరావు అన్నారు. ఈ మేరకు ఆయన పార్వతీపురం మండలంలోని జోగిదరమెట్ట గిరిజన సంక్షేమ వసతి గృహం-డోకిశీలలో చేపట్టిన మొదటి విడత దోమల మందు పిచికారి కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ప్రేయింగ్ చేస్తున్న తీరును పరిశీలించరు. ఇళ్లలో ఉన్న ఎన్ని గదులకు పిచికారీ చేస్తున్నదీ గమనించారు.