ట్యాంకర్ బోల్తా.. నేలపాలైన పాలు..!

79చూసినవారు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్డు వద్ద మినీ పాల ట్యాంకర్ బోల్తా ప‌డింది. దీంతో ట్యాంక‌ర్‌లోని పాలు నేల‌పాల‌య్యాయి. ఇది గ‌మ‌నించిన స్థానికులు బకెట్లు, బాటిళ్లలో పాలను తీసుకెళ్తున్నారు. మిర్యాలగూడ నుంచి నకిరేకల్ కు మినీ పాల ట్యాంకర్ వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.