నిలిచిపోయిన వర్షపు నీటితో ప్రజల ఇబ్బందులు

62చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఆదివారం ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక స్వయంగా వారే నీటిని తొలగించుకునే కార్యక్రమాలు చేపట్టారు. నగర పంచాయతీ అధికారులు రోడ్డుపై వర్షపు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్