క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించిన సబ్ కలెక్టర్

55చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కంభం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు నుంచి వెళ్తున్న సబ్ కలెక్టర్ రాహుల్ మీనా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించి క్షతగాత్రులను ఫోన్ ద్వారా సమాచారం అందించి 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్