పామూరులో 22న హనుమాన్ శోభాయాత్ర

54చూసినవారు
పామూరులో 22న హనుమాన్ శోభాయాత్ర
పామూరు పట్టణంలో ఈనెల 22వ తేదీన శనివారం పౌర్ణమి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు బజరంగ్దళ్ సభ్యులు బుధవారం ప్రకటనలో తెలిపారు. 22వ తేదీన ఉదయం 8 గంటలకు మదన వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద నుండి భారీ శోభాయాత్ర, బైక్ ర్యాలీ ప్రారంభం అవుతుందని బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్రలో యావన్మంది హిందువులు పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులు కాగలరనికోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్