ప్రకాశం జిల్లా మార్కాపురం
జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ చేపట్టబోతున్న చలో వెలిగొండ ప్రాజెక్టు పాదయాత్రకు సంబంధించి గోడ పత్రికను
జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. పాదయాత్ర షెడ్యూల్ సంబంధించిన అంశాలను నాదెండ్లకు కాశీనాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సురేష్, జిల్లా కో కన్వీనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.