చీమకుర్తి మండలం మంచికలపాడులో శుక్రవారం సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఫ్యాన్ గుర్తును చూపిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని కోరారు. తొలుతగ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు.