రైతులను మోసగించిన పత్తి వ్యాపారిపై కేసు నమోదు

84చూసినవారు
రైతులను మోసగించిన పత్తి వ్యాపారిపై కేసు నమోదు
రైతులను మోసగించిన పత్తి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాచర్ల మండలం చోళవీడులో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన కొమరోలు మండలానికి చెందిన వెంకటయ్య పత్తి వ్యాపారి తూకం వేయడంలో మోసానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రైతుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కోటేశ్వరరావు వెంకటయ్య పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్