గుడ్లూరు: టిడిపిలో చేరికలు
గుడ్లూరు మండలం వెంకంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు పిల్లిమిట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన ఎస్టీ కుటుంబాల వారు భారీ సంఖ్యలో కందుకూరు పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో శనివారం టిడిపి లో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ నాగేశ్వరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ. పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.