తాడేపల్లి మండలం ఉండవల్లిలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజన్కి, ప్రిజన్కి తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఆయన చూపు ఎప్పుడూ జైలు వైపే ఉంటుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి అడ్డుపడితే రెడ్ బుక్లో పేరు ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ఒకరికి గుండెపోటు, మరొకరికి చెయ్యి విరిగిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.