ప్రమాదాలు నివారించేందుకు స్టాపర్లు ఏర్పాటు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలోని కడప అమరావతి రాష్ట్రీయ రహదారిపై ఆదివారం ప్రమాదాలు నివారించేందుకు రోడ్డుపై స్టాపర్లను కొమరోలు ఎస్సై మధుసూదన్ రావు, గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంతోపాటు వాహనాలను వేగ నియంత్రణ చేసేందుకే ఈ స్టాపర్లను ఏర్పాటు చేశామని గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్ వెల్లడించారు.