మహా కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ తెగ ట్రెండ్ అయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మూవీకి మోనాలిసా రూ.21 లక్షల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. దీంతో ఈ అమ్మడు తన అమ్మకు బంగారు గొలుసు గిఫ్ట్గా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.