వైసిపి మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వైయస్సార్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు.