ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యకు భక్తులు పోటెత్తారు. రాముడి ఆలయానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో సరయు నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు, రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో ఆలయ ద్వారాలను అక్కడి అధికారులు అలంకరించారు.