రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
మద్దిపాడు మండల కేంద్రంలోని స్థానిక భారత్ పెట్రోలియం ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా ఢీ కొట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. రోడ్డు మొత్తం రక్తసిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.