భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మాండలేలోని గ్రేట్వాల్ హోటల్ శిథిలాల కింద మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఓ మహిళను రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు. ఈ క్రమంలో సహాయక బృందాలు మరింత మంది బాధితులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మయన్మార్ను ఆదుకోవడానికి పలు దేశాలు తక్షణ సాయం అందిస్తున్నారు.