Mar 31, 2025, 05:03 IST/
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Mar 31, 2025, 05:03 IST
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆదివారంతో పోలిస్తే.. సోమవారం మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 650 పెరిగి.. రూ. 84,250 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 710 పెరగడంతో.. రూ. 91,910 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100 తగ్గడంతో.. రూ.1,12,900 గా కొనసాగుతుంది.