కర్ణాటక నుంచి నల్లమలకు రానున్న ఏనుగులు

73చూసినవారు
కర్ణాటక నుంచి నల్లమలకు రానున్న ఏనుగులు
నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిరక్షణకు ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. గస్తీ కోసం 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాయగా, విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగులను నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దోర్నాల ఫారెస్ట్ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్